అమరావతి అభివృద్ధికి సమిష్టిగా కలిసి నడుద్దాం – అమరావతి బ్రాండ్‌ అంబాసిడర్‌ అంబుల వైష్ణవి

ప్రజాశక్తి – గుడివాడ (కృష్ణా) : అమరావతి అభివృద్ధికి సమిష్టిగా కలిసి నడుద్దామని అమరావతి బ్రాండ్‌ అంబాసిడర్‌ అంబుల వైష్ణవి అన్నారు. శనివారం రాత్రి స్థానిక ఎన్‌టిఆర్‌ స్టేడియంలో వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరావతి అభివృద్ధికి అందరం సమిష్టిగా కలిసి నడుద్దామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని, మనందరం ఆయనకు అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టేడియం కమిటి సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్‌, తెలుగు భాష వికాస సమితి సమన్వయకర్త డిఆర్‌బి ప్రసాద్‌, వాకర్స్‌ గవర్నర్‌ సహకా సుబ్బారావు, డిప్యూటీ గవర్నర్‌ పామర్తి కేశవరావు, మున్సిపల్‌ మాజీ ఛ్కెర్మన్‌ లంకదాసరి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

➡️