హైడ్రో పవర్ ప్లాంట్లు నిర్మాణంతో ఆదివాసీ హక్కుల ఉల్లంఘన

Apr 26,2025 12:16 #Anakapalli District

చింతలపూడి మారిక గ్రామాలు కాలిచెయించే పనిలో అదాని మనుషులు

ప్రజాశక్తి-అనకాపల్లి: : రాష్ట్రంలో న్యూ అండ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌ (ఎన్‌.ఆర్‌.ఇ.డి.సి.ఎ.పి) ద్వారా 7,400 మెగావాట్ల సామర్థ్యంతో పంప్ట్‌ స్టోరేజి పవర్‌ ప్రాజెక్టులకు 2019 నుండి 2025 మధ్య రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఉత్తరాంధ్ర ఏజెన్సీ, ప్రాంతాలలో రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌ ప్రాంతాల్లోని ఆదివాసీలను, ఇతర పేదలను వారి ఆవాసాల నుంచి వెళ్ల గొట్టేందుకు తీవ్ర మైన ప్రయత్నం చేయడం దారుణమన్నారు. చింతలపూడి మారిక గ్రామాలను కాలి చేయించే పని అదాని మనుషులు ఉన్నారని దీన్ని ప్రతిఘటించక తప్పదని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయకార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న పేర్కొన్నారు. శనివారం ఓప్రకటన విడుదల చేశారు.

హైడ్రో పవర్‌ ప్రాజెక్టులు సామర్థ్యం-దాని కేటాయింపులు
పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు మండలంలో కురుకుట్టి పి.ఎస్‌.పి (1,200 మెగావాట్లు), పాచిపెంట మండలంలో కర్రివలస పి.ఎస్‌.పి (1,000 మెగావాట్లు) ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలంలోని పెదకోట పి.ఎస్‌.పి 2024 ఆగస్టులో దాని సామర్థ్యాన్ని 1,500 మెగావాట్లు నుండి 1,800 మెగావాట్లకి పెంచింది. నవయుగ కంపెనీకి గుజ్జిలి పి.ఎస్‌.పి (1,500 మెగావాట్లు), చిట్టాంపాడు పి.ఎస్‌.పి (800 మెగావాట్లు) కేటాయించారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌కు చింతపల్లి, కొయ్యూరు మండలాల్లోని యర్రవరం పి.ఎస్‌.పి (1,200 మెగావాట్లు) వేపాడ మండలం మారిక దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ శారదా నదిపైన కేటాయించారు. 1/70 చట్టాన్ని, ఐదవ షెడ్యూల్‌ ప్రాంతంలో వర్తించే వివిధ రాజ్యాంగ నిబంధనలను బహిరంగంగా ధిక్కరిస్తూ ఈ ప్రాజెక్టులకు అనుమతించిన తీరు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని తెలిపారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీల షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు పొడిగింపు నియమాలు (పెసా), అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌.ఆర్‌.ఏ) ఉన్నాయి. ముఖ్యంగా పెసా లోని సెక్షన్‌ 5 ప్రకారం ఏదైనా భూసేకరణకు ముందు, ప్రభుత్వం వివరణాత్మక ప్రాజెక్ట్‌ సమాచారాన్ని మండల ప్రజా పరిషత్‌కి సమర్పించాలి. ఈ సమాచారంలో సమగ్ర ప్రాజెక్ట్‌ రూపురేఖలు, సామాజిక ప్రభావాలు, భూసేకరణ ప్రత్యేకతలు, కొత్త స్థిర నివాసుల గురించి సమాచారం, వారి తెగలపై సామాజిక ప్రభావం, ప్రభావిత వర్గాలకు ప్రతి పాదిత పరిహారం వంటివి ఉండాలి. అప్పుడు ఎంపిపి చట్ట బద్ధంగా ప్రభావిత గ్రామ పంచాయతీ, గ్రామ సభలతో సంప్రదించి వారి అంచనాలు, సిఫార్సులను సేకరించాలి. ఈ సంప్రదింపుల తర్వాత, ఎం.పి.పి ఈ సిఫార్సులను ఏకీకృతం చేసి, భూసేకరణ అధికారికి తుది సిఫార్సును సమర్పించాలి. వారు ఈ సిఫార్సులకు కట్టుబడి ఉండాలి. లేదా తేడా చేస్తే వివరణాత్మక రాతపూర్వక సమాధానం అందించాలి. ఎఫ్‌.ఆర్‌.ఏ లోని సెక్షన్‌ 6, వ్యక్తిగత, కమ్యూనిటీ అటవీ హక్కులను నిర్ణయించే ప్రక్రియను ప్రారంభించడానికి, పర్యవేక్షించడానికి గ్రామసభను ప్రాథమిక అధికారంగా స్పష్టంగా పేర్కొంటుంది. అటవీ భూమిని లేదా అటవీ నివాసుల హక్కులను ప్రభావితం చేసే ఏదైనా ప్రాజెక్ట్‌ ప్రారంభం నుండే గ్రామసభ పాల్గొనాలని ఎఫ్‌.ఆర్‌.ఏ నిర్దేశిస్తుంది. అంతేకాకుండా, ఎఫ్‌.ఆర్‌.ఏ లోని సెక్షన్‌ 4(డి) కమ్యూనిటీ అటవీ వనరులను నియంత్రించడానికి, వన్యప్రాణులు-జీవవైవిధ్య రక్షణకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి గ్రామసభ అధికారాన్ని బలోపేతం చేస్తుంది. ఆదివాసీ తెగలు, కంపెనీలైన వాటాదారులు ఈ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని నిర్దేశిస్తుంది. ఈ సంప్రదింపుల ప్రక్రియను దాటవేశారు. ఈ పి.ఎస్‌.పి లకు సంబంధించి, ఎటువంటి సమాచారం అందించబడలేదు. ఎటువంటి చర్చ జరగలేదు. పారదర్శకత లేదు. ఈ ప్రాంతాల్లోని ఆదివాసీలకు ఉద్దేశపూర్వకంగా దీన్ని గోప్యంగా ఉంచారు. ఆదివాసీ తెగల నుండి సంప్రదింపులు, సమ్మతి లేకపోక పోయిన,షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో భూమిని లీజుకు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్‌ భూ బదిలీ నియంత్రణ (ఎల్‌.టి.ఆర్‌) చట్టం ద్వారా నిషేధం. షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో ప్రైవేట్‌ సంస్థలు ప్రాజెక్టులను చేపట్ట లేవని సుప్రీంకోర్టు 1997 సమతా కేసులో పేర్కొంది. అంతే కాకుండా, ఇది చట్టబద్ధమైన అవసరం అయినప్పటికీ, గిరిజన సలహా మండలి (టి.ఎ.సి)లో ఈ ప్రాజెక్టులపై చర్చ, ముందస్తు సంప్రదింపులు జరపడానికి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటికీ టి.ఎ.సి ని నియమించలేదు. ఈ ఏడు ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ వల్ల కలిగే భారీ స్థానభ్రంశం గురించి, ఆదివాసీ తెగ వర్గాల జీవనోపాధిని కోల్పోయే అవకాశం గురించి ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తుంది. అటవీ, వ్యవసాయ భూమి సేకరణ.
యర్రవరం ప్రాజెక్టుకు అత్యధికంగా 735.63 ఎకరాలు, తరువాత గుజ్జిలి 673.13 ఎకరాలు, పెదకోట 499.44 ఎకరాలు, కురుకుట్టి 422.99 ఎకరాలు, కర్రివలస 377.99, చిట్టంపాడు 500 ఎకరాలు మారిక చింతలపూడి 650ఎకారాలు అవసరం. మొత్తం ఉద్దేశించిన భూ సేకరణకు ప్రభుత్వ ప్రణాళిక సిద్ధం చేసింది. కానీ వాస్తవానికి సుమారు పది వేల ఎకరాల అటవీ, వ్యవసాయ భూమికి నష్టం జరిగే అవకాశం ఉందని ఆదివాసీ తెగలు అందోళన చేస్తున్నాయి. భూసేకరణ సమస్యకు మించి, స్థానిక నీటి వనరులపై ప్రాజెక్టులు ఆధారపడటం వలన నీటి భద్రత గురించి, ఈ వనరులపై ఆధారపడిన ఆదివాసీ తెగలు, దిగువ కోణం రైవాడ లాంటి బారి ప్రాజెక్టు క్రిందన ఉన్న వేలాది ఎకారాలు ఆయకట్టు రైతులపై దాని సామాజిక ప్రభావం గురించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తాయి. వీటిని నిలుపుదల చేయకపోతే బావితరాలకు తీవ్రమైన ప్రమాదం ఎర్పడుతుందని తెలిపారు, చింతలపూడి మారిక మధ్యలో అదాని గ్రూపు సంస్థలు మారిక చింతలపూడి గ్రామాలను కాలిచెయించే ప్రయత్నం ముమ్మరం చేశాయి. దీనిపై రైవాడ ఆయకట్టు రైతులు గిరిజన పోరాటం చేయడం అవసరం దీనికి అన్ని తరగతులు ప్రజలు సిద్ధం అయ్యి అదాని సంస్థను తరిమి కోట్టవలసిన అవసరంఎంత అయిన ఉంది. ఇంకా ఆందోళన కరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్టులలో ఆదివాసీలు తమ జీవనోపాధి కోసం నిర్మించుకున్న గృహలు వ్యవసాయం భూములు విద్వషం అవుతాయి జీవనోపాధి పూర్తిగా దెబ్బతింటుంది అందుకనే గిరిజనులు పోరాటాలకు సిద్ధం కావాలని వెంకన్న ప్రకటన లో పిలుపునిచ్చారు.

➡️