విలేకరులతో మాట్లాడుతున్న కలెక్టర్
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాలు, సర్వేల ఆధారంగా జిల్లాలో 68,379 పి-4 కింద బంగారు కుటుంబాలను గుర్తించామని కలెక్టర్ తెలియజేశారు. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో జీరో పావర్టీ పి4 బంగారు కుంటుంభం, మార్గదర్శి కార్యక్రమం, అకాల వర్షాల వల్ల వచ్చే ఉరుములు, మెరుపులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికాన్ని నిర్మూలించడానికి సమాజంలోని సంపన్న వర్గాలైన ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు పైస్థాయి ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న 10 శాతం వక్తులను గుర్తించి వారి ద్వారా సమాజంలో దిగువ ఉన్న 20 శాతం కుటుంబాలకు సహాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం పి-4 కార్యక్రమాన్ని రూపకల్పన చేసిందన్నారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలనుకునే మార్గదర్శకులు ఓవతీశీజూశీఙవత్ీyజూ4.aజూ.స్త్రశీఙ.ఱఅ అనే వెబ్ సైటులో రిజిస్టర్ చేసి, లాగిన్ ద్వారా దత్తత తీసుకోవచ్చన్నారు. రవర్షాలు వస్తాయన్న సమాచారం ఉన్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అకాల వర్షాలతోపాటు పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో ప్రజలు తగిన రక్షణ ప్రాంతాల్లో ఉండాలన్నారు. ఏప్రిల్ నెలలో 21వ తేదీన జరిగిన అకాల వర్షాలు వల్ల వ్యవసాయ రంగానికి సంబంధించి 15.90 కోట్ల రూపాయలు, హార్టికల్చర్కు సంబంధించి 43 లక్షల రూపాయల నష్టం జరిగిందన్నారు. మే 3వ తేదీన వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించిన నష్టాల గురించి నివేదికలను ప్రభుత్వానికి పంపామన్నారు. రముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. హెలిప్యాడ్, ప్రజావేదిక, హెచ్ఎన్ఎస్ కాలవ పరిశీలనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలియజేశారు. విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహార్, సిపిఒ అశోక్ కుమార్, కలెక్టరేట్ కో ఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ యుగేశ్వరిదేవి పాల్గొన్నారు.