న్యూఢిల్లీకి అనంత కలెక్టర్‌

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

న్యూఢిల్లీలో బుధవారం జరగనున్న సివిల్‌ సర్వీసెస్‌ (ప్రిలిమినరీ) పరీక్షలకు సంబంధించి యుపిఎస్సీ నిర్వహించే సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు అనంత కలెక్టర్‌ డా||వి.వినోద్‌కుమార్‌ వెళ్లారు. దేశంలోని 77 జిల్లాల నుంచి ఆయా కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు అనంత కలెక్టర్‌ మంగళవారం న్యూఢిల్లీకి వెళ్లారు.

➡️