సంబరంగా జెఎన్‌టియు కళాశాల వార్షికోత్సవం

విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందిస్తున్న దేవన్న

ప్రజాశక్తి-అనంతపురం

అనంతపురం జెఎన్‌టియు ఇంజినీరింగ్‌ కళాశాల వార్షికోత్సవం, స్పోర్ట్స్‌ డే 2025 సంబరాలు ఎన్‌టిఆర్‌ ఆడిటోరియంలో శనివారం ఘనంగా జరిగాయి. ప్రిన్సిపాల్‌ చెన్నారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జెఎన్‌టియు ఉపకులపతి ఓఎస్‌డి ఎన్‌.దేవన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్‌ విద్యార్థులు వారికి నచ్చిన రంగంలో నైపుణ్యం సాధించి ముందుకు సాగాలన్నారు. ప్రిన్సిపాల్‌ పి.చెన్నారెడ్డి మాట్లాడుతూ కళాశాలలో చదువుకున్న ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. సరైన ప్రణాళికతో విద్యార్థులు ముందుకెళ్తే జీవితంలో విజయం సాధిస్తారని చెప్పారు. అనంతరం వివిధ పోట్లీల్లో గెలుపొందిన వారికీ బహుమతులు, మెరిట్‌ సర్టిఫికెట్స్‌ను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డైరెక్టర్లు నాగప్రసాద్‌ నాయుడు, సురేష్‌ బాబు, దుర్గాప్రసాద్‌, సత్యనారాయణ, సుజాత, పరీక్షలు విభాగం సిఈ ఏపీ.శివకుమార్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎస్‌.వసుంధర, కళాశాల వివిధ విభాగాల ఆధిపతులు పాల్గొన్నారు.

➡️