విలేకరులతో మాట్లాడుతున్న ఎపిటిఎఫ్ నాయకులు
ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్
విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలను వ్యతిరేకిస్తూ ఎపిటిఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహిస్తున్న ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాయల్ వెంకటేష్, ఎస్.సిరాజుద్దీన్, రాష్ట్ర పూర్వపు కార్యదర్శి నరసింహులు తెలిపారు. గురువారం ఉపాధ్యాయ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 11 డిమాండ్ల సాధన కోసం చేస్తున్న ధర్నాలో ఉపాధ్యాయులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సతీష్ కుమార్, రాష్ట్ర కౌన్సిలర్ బి.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.