డీఎస్సీ గడువు పొడిగించండి : డివైఎఫ్‌ఐ

నిరసన తెలుపుతున్న డివైఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

డీఎస్సీ అభ్యర్థులు చదువుకోవడానికి 90 రోజులు సమయం ఇవ్వాలని డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ కసాపురం రమేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో 2వ రోడ్డు స్టడీ పార్క్‌ దగ్గర అభ్యర్థులతో కలిసి బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కసాపురం రమేష్‌, జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షకు చదువుకునేందుకు సమయం తక్కువగా ఉండడంతో అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం స్పందించి సమయాన్ని పెంచాలన్నారు. జిల్లాకు ఎస్‌జిటి పోస్టులు సంఖ్య పెంచాలన్నారు. ఒకే జిల్లా, ఒకే పరీక్ష పేపర్‌ ఉండాలన్నారు. వయోపరిమితి 47సంవత్సరాలకు పెంచాలన్నారు. బ్యాక్‌లాక్‌ పోస్టులను ఈ డీఎస్సీలోనే భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు తరిమెల గిరి, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.

➡️