ప్రాజెక్టు పత్రాన్ని చూపుతున్న విసి, సిబ్బంది
ప్రజాశక్తి-అనంతపురం
అనంతపురం జెఎన్ టియు ఇంజినీరింగ్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి రూ.47.62 లక్షల డిఎస్టి సీడ్ ప్రాజెక్టు మంజూరైనట్లు ఉపకులప తి హెచ్.సుదర్శనరావు తెలిపారు. ఈమేరకు శుక్రవారం తన కార్యాల యంలో జెఎన్టియు సిబ్బందిని అభినందించారు. ఈక సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా దళిత రైతులకు శాస్త్రీయ పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక స్వయం సాధనకు తోడ్పాటు కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామీణ దళితుల జీవనోపాధి మెరుగుదలకు శాస్త్రసాంకేతిక పరిష్కారాలను అందించడం ద్వారా సమాజంలో సమానత్వం, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే ఈ పథకం దోహద పడుతుందన్నారు. ముఖ్యం గా జిల్లాలో వేరుశెనగ, టమోటా వంటి పంటలు సాగవుతున్నాయ న్నారు. శాస్త్రీయ సాగు పద్ధతుల లో పం, మార్కెట్ లింకేజీలు లేకపోవ డం, విలువ జోడింపులేని కారణం గా వల్ల రైతులకు తగిన ఆదాయం లభించకపోతోందన్నారు. ఈనేపథ్యంలో ఆయా పంటల సాగుకు సాంకేతికతను ఎలా జోడించాలన్న అంశంపై ప్రాజెక్టు బృందం పరిశోధన చేస్తుందన్నారు. ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ సి.శశిధర్ పరిశోధకుడిగా, ఎస్.చంద్రమోహన్రెడ్డి, బి.దిలీప్కుమార్, జి.మమత సహ పరిశోధకులుగా నడిపించనున్నట్లు తెలిపారు.