అర్జీదారులతో మాట్లాడుతున్న మంత్రి పయ్యావుల కేశవ్
ప్రజాశక్తి-అనంతపురం
సమస్యలపై ప్రజలు అందించే అర్జీలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురం నగరంలోని రాంనగర్లో ఉన్న ఆయన నివాసంలో మంగళవారం నాడు ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు లాంటివన్నారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు అందించిన అర్జీలను పరిశీలించి వాటికి తక్షణ పరిష్కారం చూపుతామన్నారు.