365 రోజులూ పంటలు సాగు చేసేలా ప్రణాళికలు

శిక్షణ ఇస్తున్న వి.లక్ష్మనాయక్‌

ప్రజాశక్తి-అనంతపురం

రాయలసీమ ప్రాంతంలోని మెట్ట భూభాగంలో ఏడాదిలో 365 రోజులూ రైతులు పంటలు సాగు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని రైతు సాధికార సంస్థ స్టేట్‌ చీఫ్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ వి.లక్ష్మనాయక్‌ జిల్లా ప్రాజెక్టు మేనేజర్స్‌కు తెలియజేశారు. సోమవారం నాడు అనంతపురం రైతు సాధికార సంస్థ కార్యాలయంలో రాయలసీమ పరిధిలోని డిపిఎంలు, సిబ్బందికి మూడు రోజుల ప్రాంతీయ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం కరువు జిల్లాలు అయినప్పటికీ ఇక్కడి రైతులు ద్వారా 365 రోజులు పంటలు సాగు చేసేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రకతి వ్యవసాయం ద్వారా రైతుల జీవన ప్రమాణాలు పెరుగుతాయాన్నారు. ప్రతి పంట సాగులో కూడా ఒకే రకమైన పంటలు పంటలు సాగు చేయకుండా కనీసం ఐదు రకాలు పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. ఇలా 365 రోజుల్లో 25 రకాల జీవ వైవిద్య పంటలు సాగులోకి తీసుకురావొచ్చన్నారు. రబీ, ఖరీఫ్‌ సీజన్‌తో సమ్మర్‌ సీజన్‌ మార్చి, ఏప్రిల్‌, మేని కూడా ఒక సీజన్‌ కింద తీసుకోవాలన్నారు. ఈ మూడు సీజన్‌లో కూడా మల్టీ క్రాప్‌, ఇంటర్‌ క్రాప్‌, అసోసియేట్‌ క్రాప్‌ పద్ధతులు పాటిస్తే రైతులకు నష్టం రాదన్నారు. ఈ కార్యక్రంలో రాయలసీమ జిల్లాల డిపిఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️