కేశవ్కు మొక్కను అందిస్తున్న సవితమ్మ
అనంతపురం : విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ను రాష్ట్ర బీసీ సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత, జౌళి శాఖా మంత్రి సవితమ్మ సోమవారం నాడు కలశారు. కేశవ్కు పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో మంత్రి సవితమ్మ మాట్లాడారు.