సజావుగా గ్రూప్‌-1 పరీక్షలు

పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న జాయింట్‌ కలెక్టర్‌

ప్రజాశక్తి-అనంతపురం

అనంతపురం జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఎపిపిఎస్‌సి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. పివికెకె ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరీక్ష కేంద్రంలో 234 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 149 హాజరు అయ్యారు. 85 మంది గైర్హాజరయ్యారు. శ్రీ బాలాజీ పీజీ కాలేజీ పరీక్ష కేంద్రంలో 360 మందికి గాను 232 మంది హాజరయ్యారు. 128 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ గ్రూప్‌-1 పరీక్షలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌ మల్లికార్జునుడు, కెఆర్‌ఆర్‌సి ఎస్‌డిసి తిప్పేనాయక్‌ పాల్గొన్నారు.

➡️