సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ వినోద్కుమార్
ప్రజాశక్తి-అనంతపురం
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను సెక్షన్ ఫారమ్-8 కంపెనీగా నమోదు చేసే ప్రక్రియపై శనివారం స్థానిక జెఎన్టియు ఉపకులపతి కాన్ఫరెన్స్ హల్ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డా||వి.వినోద్కుమార్, జెఎన్టియు ఉపకులపతి హెచ్.సుదర్శన రావు, సెంట్రల్ యూనివర్సిటీ వీసీ కోరి, కియ ఇండియా, జెఎస్ డబ్ల్యు అధికారులు పాల్గొన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచేలా సమావేశంలో నిర్ణయం చేశారు. అన్ని సంబంధిత విభాగాలను మెరుగైన సంబంధం, సమన్వయానికి వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటుచేసి వ్యూహాత్మక నిర్ణయాలను పరిశీలించాలనే ప్రతిపాదన చేశారు. సెక్షన్ ఫారమ్ 8 కంపెనీని ఏప్రిల్ 30లోపు నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో కియ ఇండియా ప్రతినిధి సోమశేఖర్ జెఎస్డబ్ల్యు కనకారావు, స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రతాపరెడ్డి, ఓఎస్డి దీప్తి పాల్గొన్నారు.