ప్రజాశక్తి – చిలమత్తూరు : గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన బెంగళూరు జాతీయ రహదారి కొడికొండ చెక్ పోస్ట్ సమీపంలోని ప్రీతి డెవలపర్స్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొడికొండకు చెందిన సింహాద్రి (21) ఉద్యోగరీత్యా ఉదయాన్నే పనికి వెళుతుండగా మార్గమధ్యంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనింది. ఈ ప్రమాదంలో సింహాద్రి అక్కడక్కడ మృతి చెందాడు.
