వీరుడా.. నీత్యాగం మరువం

వీరుడా.. నీత్యాగం మరువం

కళాశాలలో తోటి ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులతో కలిసి ఉన్న వీరజవాన్‌ మురళీనాయక్‌ (పాతచిత్రం)

ప్రజాశక్తి-అనంతపురం పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో వీరమరణం పొందిన మురళీనాయక్‌కు అనంతపురం శ్రీవాణి డిగ్రీ, పీజా కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు నివాలు అర్పించారు. మురళీనాయక్‌ శ్రీవాణి విద్యా సంస్థల్లో డిగ్రీ చదువుకున్నాడు. ఈ సందర్భంగా కళాశాల సీఈవో పి.సుధాకర్‌, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.హెచ్‌.వనజమ్మ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ వై.నాగరాణిలు మాట్లాడుతూ చదువుకునే రోజుల్లో ఎన్‌సిసి, క్రీడా పోటీల్లో మురళీ నాయక్‌ ఎంతో చలకాగా ఉండేవాడన్నారు. అలాంటి వ్యక్తి ఇలా మరణించడం బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎ.సుధీర్‌ రెడ్డి, ఎన్‌సిసి కోఆర్డినేటర్లు రామస్వామి నాయక్‌, నర్మదా, సి.ముత్యాలప్ప, కొండన్న, నర్సా నాయుడు, స్వర్ణలత పాల్గొన్నారు.

➡️