సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ వినోద్కుమార్
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం ద్వారా అందే వివిధ రకాల సేవలను పారదర్శకంగా ప్రజలకు అందించాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో జిల్లాలోని తహశీల్దార్లు, సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దారులు, విలేజ్ సర్వేయర్లతో ఐవిఆర్ఎస్కు సంబంధించి కౌన్సిలింగ్, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ సర్వీసులు, పథకాలకు సంబంధించి ప్రజల నుంచి వారి అభిప్రాయాన్ని ఐవిఆర్ఎస్ ద్వారా గత మూడు నెలలుగా సర్వే చేయడం జరుగుతున్నదన్నారు. దీనిని పకడ్బందీ ప్రభుత్వం సూచించిన మేరకు నిర్వహించాలని తెలియజేశారు. ఐవిఆర్ఎస్ నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ద్వారా వచ్చినటువంటి ప్రాంతానికి వెళ్లి మళ్లీ పరిశీలన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, డిఆర్ఒ ఎ.మాలోల, ఆర్డీవో కేశవ నాయుడు, సర్వే ఏడీ రూప్ల నాయక్, ఏఎస్ఒ జగన్మోహన్ పాల్గొన్నారు.