1200 పడకలకు ఆసుపత్రిని విస్తరిస్తాం

ఆర్‌ఒ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌

ప్రజాశక్తి-అనంతపురం

అనంతపురం సర్వజనాసుపత్రిని 1200 పడకల ఆసుపత్రిగా త్వరలో విస్తరిస్తామని అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ తెలిపారు. జెఎన్‌టియు రోడ్‌లో ఉన్న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో సప్తగిరి క్యాంపర్‌ సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సప్తగిరి క్యాంపర్‌ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం అన్నారు. ఇప్పటికే సర్వజనాసుపత్రితో పాటు సిడి హాస్పిటల్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలలో 25 లక్షలతో ఆర్‌ఒ ప్లాంట్లు ఏర్పాటు చేశారన్నారు. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అనంతపురం సర్వజనాసుపత్రిలో అవసరమైన భవనాల నిర్మాణానికి రూ.38కోట్లతో టెండర్లు పిలిచినట్లు తెలిపారు. అనంతరం స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ సన్మానించారు.

➡️