కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎస్పీ పి.జగదీష్
ప్రజాశక్తి -అనంతపురం క్రైం
అనంతపురం నగరంలో ట్రాఫిక్ మెరుగుదలకు అంకితబావం, సమన్వయంతో పని చేయాలని ఎస్పీ పి.జగదీష్ ఆదేశించారు. సోమవారం స్థానిక పోలీస్ కన్వెన్సన్ హాలులో ట్రాఫిక్, నగర పోలీసులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా క్లాక్టవర్, శ్రీకంఠం సర్కిల్, సప్తగిరి సర్కిల్, తాడిపత్రి బస్టాండు, పాతవూరు, గాంధీబజార్, ఎన్టీఆర్ సర్కిల్, చంద్ర హాస్పిటల్ సర్కిల్, రుద్రంపేట సర్కిల్, బళ్లారి బైపాస్ కూడళి, జాతీయ రహదారిపైకి కలిసే సర్వీసు రోడ్లు, ప్రధాన రహదారులపై కొనసాగుతోన్న వాహనాల రాకపోకలు, సిగల్స్పై సమీక్షించారు. ఆయా కేటాయించిన పాయింట్లలో పక్కాగా విధుల్లో ఉండటంతో పాటు ప్రజలు, వాహనదారులు అసౌకర్యానికి గురికాకుండా యాక్టివ్గా పని చేయాలన్నారు.