ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్యజిల్లా) : రైల్వేకోడూరు పట్టణంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె గురువారానికి 24వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీలు ఐసిడిఎస్ కార్యాలయం సమీపంలో నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పి.జాన ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జయరాం, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్, సిఐటియు అనుబంధం, జిల్లా అధ్యక్షులు శ్రీ లక్ష్మీ, ప్రాజెక్టు, గౌరవ అధ్యక్షులు, వనజ కుమారి , అధ్యక్షురాలు, శ్రీరమాదేవి, వర్కింగ్ ప్రెసిడెంట్, రాధా కుమారి, మండల కార్యదర్శి జి. పద్మావతి, వెన్నెల,దుర్గ, శిరీష, లీలావతి, జయకుమారి, సుజాత, మునీంద్ర, ఈశ్వరమ్మ, కుమారి, నాగరాణి, వాణి, స్వర్ణలత, గీత, సురేఖ, కళ, రెడ్డమ్మ, రోజా, చెంచులక్ష్మి, బేబీ, సునీత, ఏఐటీయూసీ నాయకులు సరోజ నిర్మల నాగమణి తదితరులు పాల్గొన్నారు.
