జగన్‌ను కలిసిన ‘అన్నా’

ప్రజాశక్తి-మార్కాపురం : వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని వైసిపి మార్కాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ మీర్జా షంషీర్‌ అలీబేగ్‌, బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పిఎల్‌పి యాదవ్‌, పార్టీ నాయకులు పోరెడ్డి చెంచిరెడ్డి బుధవారం ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

➡️