పాడి రైతుల సంక్షేమానికి కృషి

ప్రజాశక్తి – సంబేపల్లి (రాయచోటి) పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం విశేష కషి చేస్తుందని రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సంబేపల్లి మండలం, నాగిరెడ్డి గారిపల్లెలో రూ.27.60 లక్షలతో నిర్మించిన మినీ గోకులాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమానికి ఎనలేని కషి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి నారాచంద్ర బాబునాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాడి రైతులకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి ప్రతి గ్రామానికీ మినీ గోకులాలు మంజూరు చేస్తున్నారని చెప్పారు.సంబేపల్లి మండలంలోని నాగిరెడ్డిగారిపల్లెకు 12 మినీ గోకులాలు మంజూరు చేసి పూర్తిచేశారని పేర్కొన్నారు. ఒక్కొక్క మినీ గోకులానికి రూ. 2.30 లక్షల వ్యయంతో నిర్మించారు. పాడి రైతులకు తమ పశువులు ఎండకు, వాన బారిన పడకుండా మినీ గోకులాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. రైతులందరూ పాడి రైతులకు అందించే సబ్సిడీలను సద్వినియోగం చేసుకొని మరింత అభివద్ధి చెందాలన్నారు. అనంతరం మంత్రి నారాయణరెడ్డిపల్లెలో నిర్మించిన సిమెంట్‌ రోడ్ల నిర్మాణాలను ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మత్స్యకారుల జీవితాలలో వెలుగులు కూటమి ప్రభుత్వం రాకతో మత్యకారుల జీవితాలలో వెలుగులు నిండాయని రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ. 20వేల సాయం విడుదల చేస్తామని చెప్పిన హామీని నెరవేర్చారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న 1,29,178 మత్స్యకార కుటుంబా లకు రూ.259 కోట్ల లబ్ధి చేకూరు తోందన్నారు. మత్స్యకారుల సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మత్యకారుల సంక్షేమాన్ని దష్టిలో ఉంచుకొని వేట నిషేధ సమయంలో ఆర్థికసాయం రెట్టింపు చేసి విడుదల చేసిందన్నారు. దీని వల్ల 1,29,178 మత్స్యకార కుటుంబాలకు రూ. 259 కోట్ల లబ్ధి చేకూరిందరన్నారు. సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు పడకుండా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారని చెప్పారు. గత పాలకులు ఫిష్‌ ఆంధ్ర పేరుతో రూ. 300 కోట్లు ఖర్చు పెట్టారని, కానీ ఒక్క మత్స్యకారుడు కూడా బాగుపడలేదని విమర్వించారు. 2014లో తొలిసారిగా తెలుగుదేశం ప్రభుత్వమే వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు భతిని ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. 2014-2019 మధ్య మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.788 కోట్లు ఖర్చు పెట్టారని, వలలు, పడవలు, ఐస్‌ బాక్సులు అదనంగా అందజేశారని చెప్పారు. రాష్ట్రంలో 68,396 మంది మత్స్యకారులకు నెలనెలా పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. మత్స్యకారులు చేపల వేట సమయంలో మరణిస్తే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లిస్తున్నామున్నారు. మత్స్యఉత్పత్తుల ద్వారా 16.50 లక్షల మందికి ఉపాధి లభిస్తోందిన్నారు.

➡️