గ్రంథాలయ అధికారి విజయకుమార్
ప్రజాశక్తి-కలికిరి: వేసవి విజ్ఞాన తరగతులను విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. జిల్లగ్రంథాలయసంస్థ ఆధ్వర్యంలో శాఖ గ్రంధాలయం కలికిరి నందు వేసవి శిక్షణా తరగతులు ఏప్రిల్ 28 నుండి జూన్ 6 వరకు ప్రారంభం కానున్నాయని, ఈ విజ్ఞాన శిబిరంలో విద్యార్థులకు ఉదయం 8గంటల నుండి 11 గంటలవరకు తరగతులు నిర్వహిస్తారని చెప్పారు. ఈ తరగతులలో ముఖ్యం గా విద్యార్థులలో తెలుగు భాషాభివృద్ధి పెంపొందించేందుకు కథలు చదవడం, రాయడం, పుస్తకాలు చదవడం, విలువలు విద్య, స్పోకెన్ ఇంగ్లిష్, డ్రాయింగ్, పెయింటింగ్ పేపర్ క్రాఫ్ట్, డ్యాన్స్, చెస్, జికె, యోగ మొదలైన అంశాలను నేర్పిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి బోధించడానికి వాలంటీర్ గా ప్రతిభ కలిగిన వారు తమ పేర్లను నమోదుచేసుకోవాలని, వివరాలకు 7780169780 నంబరుకి సంప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు తల్లి దండ్రులు హాజరు కావాలని గ్రంధాలయ అధికారి అన్నారు.
