ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలో దరఖాస్తులు ఆహ్వానం

ప్రజాశక్తి- కలకడ (రాయచోటి-అన్నమయ్య) : ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలో ఉచిత సీట్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ మునీంద్ర నాయక్‌ తెలిపారు. విద్య హక్కు చట్టం ప్రకారం 2025- 26వ సంవత్సరానికి మండలంలోని ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలో ఒకటవ తరగతిలో ఉచితంగా 25 శాతం సీట్లను కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఉచిత అడ్మిషన్లు ప్రారంభమై రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని అర్హత కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన తెలిపారు. విద్యార్థులకు సిబిఎస్‌ఇ, ఐ సి ఎస్‌ ఈ ఐబి పాఠ్యాంశాలను అనుసరిస్తూ పాఠశాలలో ప్రవేశం కోసం విద్యార్థులు ఆరు సంవత్సరాలు పూర్తి అయిన వారు అర్హులన్నారు.స్టేట్‌ పాఠ్యాంశాలను అనుసరిస్తూ ప్రవేశాల కోసం విద్యార్థి ఐదు సంవత్సరాలు నిండి ఉండాలని అన్నారు.అర్హత కలిగి అర్హులైన వారు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు, మరియు అనాధ పిల్లలు, హెచ్‌ఐవి బాధ్యులు, విభిన్న ప్రతిభావంతులకు, ఈ సీట్లను కేటాయించడం జరుగుతుందని ఆయన తెలిపారు.కావున ఈనెల 28వ తేదీ నుండి మే 15వ తేదీ లోపల దరఖాస్తులను సేకరించడం జరుగుతుందన్నారు. దరఖాస్తులను షషష.షరవ.aజూ.స్త్రశీఙ.ఱఅ అను వెబ్సైట్‌ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని, లేదా సచివాలయంలో గాని, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో గాని ,మీసేవ కేంద్రాల్లో గాని, దరఖాస్తులు చేసుకోవాలన్నారు.ఈ అవకాశాన్ని అర్హత లేని వారు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ కోరారు.

➡️