ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

May 6,2025 17:49 #aasha workers

ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్ : ఆశా వర్కర్ల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు సహకరించాలని కోరుతూ మంగళవారం పార్వతీపురం మండలంలో ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు పెదగొండపల్లి, బందలుపి, డోకి శిలా పీహెచ్ సి వైద్యాధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆశా వర్సర్ ను రెగ్యులరైజ్ చేయాలని, కనీసవేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గిరిజన ప్రాంతాల్లో సిహెచ్.డబ్ల్యూలను ఆశాలుగా గుర్తించాలని, చట్ట బద్దమైన సౌకర్యాలు కల్పించాలని, పెన్షన్ ఇవ్వాలని ఆశావర్కర్ల నాయకులు డిమాండ్ చేశారు.  గత 7 సంవత్సరాల కాలంలో కేంద్రంలోని బిజేసి ఆశా వర్కర్లకు కేవలం రూ. 1000/-లు మాత్రమే పెంచింది. దేశవ్యాపితంగా ఒకే రకమైన పనిపరిస్థితులు ఉండాలని, కనీస వేతనాలు చెల్లించాలని కోరుతున్నాము. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి సూరిబాబు, ఆశ వర్కర్స్ యూనియన్ సీనియర్ నాయకులు శాంతి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

➡️