ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్ : రైలులో ప్రయాణికురాలు పోగొట్టుకున్న 17 లక్షల రూపాయల విలువైన వస్తువులు కలిగిన హ్యాండ్ బ్యాగ్ ను తిరిగి ఆమెకు ఏలూరు రైల్వే పోలీసులు శనివారం మధ్యాహ్నం అప్పగించారు. ఏలూరు రైల్వే ఎస్సై సైమన్ తెలిపిన వివరాల ప్రకారం …. విజయవాడ నగరానికి చెందిన రమాదేవి బంధువుల వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు విజయవాడ నుండి పెద్ద తిరుపతి బయలుదేరి వెళ్ళింది. తిరిగి కాకినాడ పోర్టు రైలు బండిలో తిరుపతి నుండి విజయవాడకు ప్రయాణమైంది. ఈరోజు ఉదయం ఆమె విజయవాడ రైల్వే స్టేషన్లో రైలు దిగి తనతో వెంట తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్ ను వదిలి ఇంటికి వెళ్లిపోయింది ఇంటికి వెళ్లిన తర్వాత చూసుకునేసరికి హ్యాండ్ బ్యాగ్ లేకపోవడంతో వెంటనే విజయవాడ జిఆర్పి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది బ్యాగులో 21 తులాల బంగారు ఆభరణాలు నగదు ఉన్నాయని ఆమె వారికి తెలియజేసింది. వెంటనే విజయవాడ రైల్వే పోలీసులు ఏలూరు రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు విజయవాడ రైల్వే ఎస్సై సైమన్ కాకినాడ పోర్టు రైలు బండిని ఏలూరు రైల్వే స్టేషన్ లో నిలుపుదల చేసి రమాదేవి ప్రయాణించిన భోగిలో ఉన్న హ్యాండ్ బ్యాగులు టిటి సహాయంతో స్వాధీనపరుచుకున్నారు. ఈ విషయాన్ని విజయవాడ రైల్వే పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న రమాదేవి వేలూరు జి ఆర్ పి రైల్వే స్టేషన్ కు శనివారం మధ్యాహ్నం చేరుకున్నారు ఏలూరు రైల్వే ఎస్సై సైమన్ తన సిబ్బందితో కలిసి రమాదేవికి ఆమె పోగొట్టుకున్న బ్యాగును తిరిగి అప్పగించారు. ఆ బ్యాగ్ లో ఉండవలసిన 21 తులాల బంగారు ఆభరణాలు 13500 నగదు ఇంటి తాళాలు ఒక సెల్ ఫోన్ ను ఆ బ్యాగ్ లో ఉన్నట్లు గుర్తించి మొత్తం వస్తువులతో కలిపి ఆమెకు అప్పగించారు. రైల్వే డిఎస్పి రత్నరాజు విజయవాడ రైల్వే సీఐ దుర్గారావు రైల్వే ఎస్సై సైమన్లకు కఅతజ్ఞతలు తెలియజేశారు. ఖరీదైన బ్యాగ్ ను తిరిగి ప్రయాణికురాలికి అప్పగించినందుకు ఏలూరు రైల్వే ఎస్ఐ సైమన్ కు రైల్వే ఉన్నతాధికారులు ప్రశంసపత్రాన్ని ఈ బ్యాగ్ ను ప్రయాణికురాలకు అప్పగించడానికి ఏలూరు జిఆర్పి పోలీసులు ఆర్పిఎఫ్ పోలీసులు సమీకృతంగా సహకరించారు.
ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ ప్రయాణీకురాలికి అప్పగింత
