అథ్లెటిక్స్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు వితరణ

May 6,2025 14:55 #Vizianagaram

ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : ది గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం చారిటబుల్ ఫౌండేషన్ తరపున ప్రతినెల చేసే దాతృత్వ కార్యక్రమాల్లో భాగంగా ఈనెల కార్యక్రమముగా మంగళవారం విజయనగరం వారి సౌజన్యంతో 20 మంది జాతీయ అథ్లెటిక్స్ క్రీడాకారులకు స్పోర్ట్స్ యూనిఫాం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్ధ అధ్యక్షురాలు రాధిక మంగిపుడి, ప్రధాని కార్యదర్శి సూర్యలక్ష్మి, ఉపాధ్యక్షులు కేఆర్ కే రాజు, సహాయ కార్యదర్శి హరిగోపాల్, కోశాధికారి రవికుమార్, కార్యవర్గ సభ్యులు సుధా నాయక్, చంద్రశేఖర రావు, మల్లి , గుగ్గిలం రామారావు ,సుభద్ర దేవి తదితరులు పాల్గొన్నారు వీరితో పాటుగా విజయనగరం జిల్లా అథ్లెటిక్ సంఘ సభ్యులు పి .లీలా కృష్ణ, జి .శ్రీకాంత్ వి .ఆనంద్ కిషోర్ మరియు కోచస్ పి .సతీష్ , పి. శివ పాల్గొన్నారు మరిన్ని రాష్ట్రస్థాయి జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచి పథకాలు సాధించాలని సభ్యులందరూ కూడా పిల్లల్ని ప్రోత్సహించి అభినందనలు తెలిపారు.

➡️