రజకులపై దాడులు అరికట్టాలి

Mar 10,2024 15:01 #Rajakus, #vijayanagaram
  • ఎస్సీ జాబితాలో చేర్చాలి
  • ఎపి రజక సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కరరావు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ :  ఆర్థికంగా,సామాజికంగా వెనుకబడిన రజకులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని ,రజకులు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ది కోసం ఎస్సీ జాబితాలో చేర్చాలని ఎపి రజక సంఘం జిల్లా అధ్యక్షుడు తంగెటి భాస్కరరావు డిమాండ్ చేశారు.ఆదివారం విజయనగరం టౌన్ పరిధిలో వీటి అగ్రహారం దగ్గర శ్రీ పైడిమాంబ రజిక సేవా సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సంఘం అధ్యక్షులు తంగేటి భాస్కరరావు సెక్రెటరీ జంపా చిన్న పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం రజకులు సమస్యలు పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు.ప్రభుత్వం అనేక ఏళ్లుగా ఎదుగు బొదుగు లేకుండా వృత్తి మీద అదారిపడి జీవించడం జరుగుతుందన్నారు.రజకులు అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడం లో ప్రభుత్వాలు కనీస ప్రయత్నాలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా,సామాజికంగా వెనుకబడిన రజకలును ఆదుకోవాలని డిమాండ్ చేశారు.సమావేశంలో ఉపాధ్యక్షులు షీలా తాతారావు గోవిందు జాయింట్ సెక్రెటరీ రాజు రమణ , వీటి అగ్రహారం సంఘం సభ్యులు గురు నాయుడు సభ్యులు పాల్గొన్నారు.

➡️