ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల-సూర్యలంక మార్గంలో కోమలి రెస్టారెంట్ సమీపంలో వేగంగా ప్రయాణిస్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా కొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వైద్యం కోసం చీరాల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతి చెందిన వ్యక్తి బాపట్ల మండలం అడవి గ్రామపంచాయతీ రామ్ నగర్ గ్రామానికి చెందిన దండుప్రోలు కృపాకర్ అని తెలిసింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
