ప్రజాశక్తి – చీరాల : డ్రైనేజీ కాలవలు మరమ్మతులకు గురి కావడంతో మురికి నీరు అంతా రోడ్లపైకి చేరి వరద తలపిస్తు దుర్వాసన వెదజల్లుతున్న ఘటన పట్టణంలోని మసీదు సెంటర్లో కనిపిస్తోంది. గత రెండు రోజుల నుండి ఇదే పరిస్థితి. ఇటీవల కురిసిన వర్షానికి డ్రైనేజీ పైప్లైన్లన్నీ మరమ్మత్తులకు గురి కావడంతో మురుగునీరు కుందేరులోకి పారుదల లేక కాలువలో వ్యర్ధాలు అన్ని ఇరుక్కుపోయ్యాయి. దీంతో మురుగునీరు పారుదల లేక కాలవలో పొంగిపొర్లతో రోడ్లపై వర్షపు నీటిని తలపిస్తూ మురుగు నీరు అంతా చేరింది. దీంతో పక్కనే ఉన్న హాస్పిటల్స్ వద్ద, లూధరన్ చర్చ్ వద్ద మురుగు భారీగా రోడ్లపైకి చేరి దుర్వాసన వెదజల్లుతుంది. దీంతో బాటసారిలు వాహనదారులు అందరూ మురికి నీటిలోనే ప్రయాణం చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టి రోడ్లపై చేరిన మురుగునీరును కాలవలో మరమ్మతులు చేయించి కుందేరులోకి తరలించాలని స్థానికులు కోరుతున్నారు. అయితే గతంలోనూ ఇలాంటి సమస్యలు ఎదురైనప్పటికీ అధికారులు తాత్కాలిక చర్యలు చేపడుతున్నారు. తప్ప శాశ్వత పరిష్కారం చేసి సమస్యను పరిష్కరించడం లేదని అధికారుల తీరుపై పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడైనా పూర్తిస్థాయిలో డ్రైనేజీ కాలువలు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
