ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్ : సులభతరమైన, మెరుగైన సేవలను పట్టణ ప్రజలకు త్వరితగతిన అందజేయాలని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం ఆర్డి పెనుగంటి నాయుడు.. వార్డు సచివాలయాల ప్లానింగ్ సెక్రటరీలను ఆదేశించారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారి పి.ప్రమీలరాణి, వార్డు సచివాలయాల ప్లానింగ్ సెక్రటరీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణానికి సంబంధించిన అనధికార భవన నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విధులు సక్రమంగా నిర్వహించాలని, సమయపాలన పాటించాలని సూచించారు. అనధికార, అక్రమ నిర్మాణాలపై విచారణ చేపట్టి, చర్యలు చేపడతామని ఆదేశించారు. కార్యక్రమంలో పట్టణ ప్లానింగ్ అధికారులు, ప్రయివేట్ లైసెన్స్ ప్లానర్లు, తదితరులు పాల్గొన్నారు.
