గొర్రెలు, మేకలకు నీలి నాలుక టీకాలు వేయించాలి : మండల పశు వైద్యాధికారి

ప్రజాశక్తి – ముద్దనూరు (కడప) : గొర్రెలు, మేకలకు నీలి నాలుక టీకాలు వేయించాలని మండల పశు వైద్యాధికారి వాసా శ్రీనివాస తెలిపారు. తిమ్మాపురం గ్రామంలో గురువారం వాసా శ్రీనివాస ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు నీలి నాలుక (బ్లూ టంగు) టీకాల కార్యక్రమం నిర్వహించారు. వాసా శ్రీనివాస మాట్లాడుతూ … గొర్రెలు, మేకలకు నీలి నాలుక టీకా వేయకపోతే నోటి పుండ్లు, జ్వరం వచ్చి నీరసించి చనిపోయే అవకాశం ఉందన్నారు. మండల వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 9,500 గొర్రెలు, మేకలకు టీకాలు వేసినట్లు చెప్పారు. గొర్రెలు, మేకలకు నీలి నాలుక తప్పకుండా వేయించాలని కాపరులు, యజమానులను కోరారు. ఈ కార్యక్రమంలో పశు సహాయక సిబ్బంది, వీరేంద్ర పాల్గొన్నారు.

➡️