ప్రజాశక్తి-చల్లపల్లి(కృష్ణా) : స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం చల్లపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రత, శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలక్ట్రికల్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి సిబ్బందికి తగు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ సూపర్డెంట్ డాక్టర్ బి.శ్రీరంగం శ్రీనివాస్ , డాక్టర్ దుర్గా శైలజ రెడ్డి , డాక్టర్ సుమా చౌదరి, డాక్టర్ బి.వంశీ పవన్, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
