విశాఖ : కాశ్మీర్ లోని పహెల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు మఅతి చెందారు. మఅతుల్లో ఒకరు విశాఖకు చెందిన చంద్రమౌళి. శుక్రవారం చంద్రమౌళి పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి మఅత దేహాన్ని అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళుతుండగా ఆయన కుమార్తె తీవ్రంగా రోదించింది. బంధువులు, స్నేహితులు కన్నీరు పెట్టుకున్నారు. చంద్రమౌళి అంతిమయాత్రలో విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, హోం మంత్రి వంగలపూడి అనిత, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. చంద్రమౌళి పార్థివదేహానికి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైసీపీ నేతలు నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చంద్రమౌళి మఅతితో విశాఖలో తీవ్ర విషాదం నెలకొంది. చంద్రమౌళి స్నేహితులు ఆయన లేడనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. కాశ్మీర్ పర్యటనను ఈరోజుతో ముగించుకొని.. అంటే ఏప్రిల్ 25వ తేదీన ముగించుకుని సేఫ్గా తిరిగి వస్తాడనుకుంటే.. ఈ రోజు ఇలా జరగడం చాలా బాధగా ఉందని బంధువులు, స్నేహితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పహెల్గామ్ ఉగ్రమూకల దాడిలో మఅతి చెందిన నెల్లూరు వాసి మధుసూదన్ పార్థివదేహానికి నిన్న అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గన్నారు. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మధుసూదన్ మఅతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మధుసూదన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
