బాధిత కుటుంబానికి చెక్కు అందజేత

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు: ఈదుముడిలో పిడుగుపాటుకు మతి చెందిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం రూ.4 లక్షలు మంజూరు చేసింది. ఎమ్మెల్యే బిఎన్‌ విజయకుమార్‌ మంగళవారం బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ లక్ష్మి ప్రసన్న, తహశీల్దార్‌ ప్రవీణ్‌ కుమార్‌, టిడిపి మండల అధ్యక్షులు తేళ్ల మనోజ్‌ కుమార్‌, క్లస్టర్‌ ఇంచార్జి కాకర్ల లక్ష్మి వరప్రసాద్‌, గ్రామ పార్టీ అధ్యక్షులు కుర్రా వీరాంజనేయులు, పార్లమెంట్‌ ఎస్‌సి సెల్‌ సెక్రటరీ రంపతోటి అంకారావు, కొండ్రగుంట రంగారావు, మండల ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు తెలగతోటి జాన్సన్‌ నాగేశ్వరావు, ఆళ్ల ప్రేమ్‌ చంద్‌ పాల్గొన్నారు.

➡️