ప్రజాశక్తి-గంట్యాడ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పసవాల సంఖ్యను పెంచాలని డిఎంహెచ్ఒ జీవనరాణి వైద్యులను ఆదేశించారు. గురువారం గంట్యాడ మండలంలో పెదమజ్జిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, శ్రద్ధతో రోగులను తనిఖీ చేయాలని సూచించారు. ప్రతిరోజూ ఒపి పెంచాలన్నారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న అన్ని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం కొండతామరాపల్లిలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యులు పల్లవి, సతీష్, సిసి రాజు, హెల్త్ ఎడ్యుకేటర్ అనిల్, ప్రేమ కుమార్, సీనియర్ సహాయకులు లక్ష్మీబాయి, తదితరులు పాల్గొన్నారు.
