వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలి రైతులపై దాడులు అరికట్టాలి రైల్వేల ప్రయివేటీకరణ ఆపాలి సిపిఎం, సిపిఐ నాయకుల నిరసన

వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలి రైతులపై దాడులు అరికట్టాలి రైల్వేల ప్రయివేటీకరణ ఆపాలి సిపిఎం, సిపిఐ నాయకుల నిరసన

వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలి రైతులపై దాడులు అరికట్టాలి రైల్వేల ప్రయివేటీకరణ ఆపాలి సిపిఎం, సిపిఐ నాయకుల నిరసనప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆలంబిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చిత్తూరు రైల్వే స్టేషన్‌ వద్ద సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ నాగరాజు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని అమలు చేయకపోవడంతో మరో పోరాటం చేస్తున్న రైతాంగంపై విచక్షణా రహితంగా ఢిల్లీలో దాడి చేయడం దుర్మార్గమని రైతులపై జరుగుతున్న దాడులకు నిరసన చేస్తున్నామని తెలిపారు. 14వ తేదీ ఢిల్లీలో భారీ ఎత్తున నిరసన చేపడుతామని దేశంలోని రైతాంగం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు అందుబాటులో ఉంటున్న రైల్వేల ప్రైవేటీకరణ వేగవంతం చేసిందన్నారు. అందులో భాగంగా సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా ప్యాసింజర్‌ రైలును ఎక్స్‌ప్రెస్‌గా మార్చి భారీ స్థాయిలో టికెట్‌ రేట్లు పెంచడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేసి భవిష్యత్తు తరాలకు ఉపాధి అవకాశాల్లేకుండా చేయడం అన్యాయమన్నారు. అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ దేశ సంపదను మొత్తం కార్పొరేట్‌ శక్తులైన ఆదానీ, అంబానీలకు కట్టబెట్టడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా కొన్ని రకాల తాయిలాలు మాత్రం ఇస్తే సరిపోదని దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతన్నలకు ప్రమాదకరమైన వ్యవసాయ నల్ల చట్టాలను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. రైతుల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్ల పేరుతో రైతులపై దాడి చేస్తున్నారని, స్మాట్‌ మీటర్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాబోయే ఎన్నికల్లో మతోన్మాద బీజేపీ, దానికి వంత పాడుతున్న వైసిపి, టిడిపి, జనసేనలకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జ్యోతి, లోకనాథం, ప్రసాద్‌, సిపిఐ నాయకులు గోపి , చంద్ర, రమాదేవి, బాలాజీ పాల్గొన్నారు.

➡️