పరిపూర్ణ ఆరోగ్యానికి పారిశుధ్యం

పరిపూర్ణ ఆరోగ్యానికి పారిశుధ్యం

పరిపూర్ణ ఆరోగ్యానికి పారిశుధ్యం ప్రజాశక్తి-కుప్పం రూరల్‌ : పరిపూర్ణ ఆరోగ్యానికి పారిశుద్ధ్యం తొలి మార్గమని గుడ్లనాయనపల్లి గ్రామ సర్పంచ్‌ ఝాన్సీరాణి గిరి ప్రసాద్‌ తెలిపారు. బుధవారం గ్రామ పరిధిలో పారిశుద్ధ్య పనులను ప్రారంభించారు. ఈ పనులను ఎంపీడీవో, పంచాయతీ సెక్రెటరీ పర్యవేక్షించి, పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పాటించినప్పుడే ప్రజలు పూర్తి ఆరోగ్యంతో ఉంటారని, పారిశుధ్యం, పచ్చదనం గ్రామాల అందాన్ని మరింత పెంచుతుందని, గ్రామ పరిధిలో పారిశుద్ధ్యన్ని పాటించడంతోపాటు, చెట్లను పెంచి పచ్చదనాన్ని కాపాడాల్సిన పంచాయతీ అధికారులతో పాటు ప్రజలపై కూడా ఉంటుందన్నారు.

➡️