పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్ ఎన్వీ రమణారెడ్డి
ప్రజాశక్తి-పలమనేరు : పలమనేరు నియోజకవర్గం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కూడా అన్న క్యాంటీన్లో ఉదయం ఏడు గంటలకే పలమనేరు మున్సిపల్ కమిషనర్ ఎన్ వి రమణారెడ్డి పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ అన్న క్యాంటీన్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్నందువలన పలమనేరు నియోజకవర్గ ప్రజలే కాకుండా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు కూడా ఇక్కడ భోంచేసి, తమ తృప్తిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలు కనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ప్రారంభించినటువంటి అన్న క్యాంటీన్ వలన ఎంతోమంది తమ ఆకలి బాధను తీర్చుకొని, తమ సంతృప్తిని తెలియజేస్తున్నారు. అందువలన క్యాంటీన్ పరిసర ప్రాంతాల్లో త్రాగునీరు, స్వచ్ఛత, పరిశుభ్రతపై మరియు క్యాంటీన్లో పంపిణీ చేసే ఆహార నాణ్యతపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలియజేశారు. కావున ఈ సదవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరినారు