పట్టణ అధ్యక్షులు గజవల్లి పై కేసు నమోదు చేయాలి : దళిత బహుజన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిలాని

ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : చీరాల మునిసిపల్‌ కౌన్సిలర్లు ఇటీవల జిల్లా కలెక్టర్‌ వెంకట మురళి ను కలసి చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు పై అవిశ్వాసం కోరుతూ ఇచ్చిన తీర్మానాన్ని నిలిపివేయాలి అంటూ జిల్లా కలెక్టర్‌ కి వినతిపత్రాన్ని ఇవ్వడమే కాకుండా శాసనసభ్యులు ఎంఎం కొండయ్య పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావుపై కేసు నమోదు చేయాలని దళిత బహుజన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ కె జిలాని మంగళవారం ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అనుమతి తీసుకోకుండా అవిశ్వాసం వద్దు అని కలెక్టర్‌ కలిశారన్నారు. చీరాల నియోజకవర్గ అభివఅద్ధి కోసం అహర్నిశల కఅషి చేస్తున్న ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. నియోజకవర్గానికి ప్రథమ పౌరుడుగా ఉన్న ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు చేయటం బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ను అగౌరవపరచటంగా భావించి గజవల్లి శీను పై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని కోరుతూ ఒకటవ పట్టణ సిఐ సుబ్బారావుకు ఇచ్చిన ఫిర్యాదులో జిలాని పేర్కొన్నారు.

➡️