ప్రజాశక్తి-రాజోలు : సీఎం సహాయ నిధి పేదలకు వరమని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. సోమవారం మలికిపురంలొని ఎంఎల్ఎ కార్యలయంలో స్వగృహంలో 25 బాధిత కుటుంబాలకు రూ.19.10 లక్షలు చెక్కులను పంపిణీ చేశారు. ప్రజారోగ్య పరిరక్షణే కూటమి తొలి ప్రాధాన్యమని అనారోగ్యంతో ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు అండనిస్తుందన్నారు. ఈ 11 నెలల కాలం లో 231 బాధిత కుటుంబాలకు 2.21 కోట్ల రూపాయలు అందజేయడం జరిగిందని తెలిపారు. ఎవరైతే అనారోగ్యంతో బాధ పడుతున్నారో వారందరికీ బాసటగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డెల్టా చైర్మన్ గుబ్బల శ్రీనువాస్, జనసేన రాష్ట్ర నాయుకులు దిరిశాల బాలాజీ ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
