మైలవరం (ఎన్టీఆర్ జిల్లా) : ముఖ్యమంత్రి సహాయనిధి, లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోసీ) ద్వారా ఎందరో పేద ప్రజల ప్రాణాలను కాపాడగలుగుతున్నామని, మరెందరికో ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. మైలవరంలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను శాసనసభ్యులు కృష్ణప్రసాదు లబ్ధిదారులకు బుధవారం అందజేశారు. మైలవరం మండలంలోని 11 మంది లబ్ధిదారులకు తాజాగా రూ.6,84,022లు మంజూరయ్యాయి. సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటు సీఎం చంద్రబాబు సందేశ పత్రాలను అందజేసి, వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ … ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం సంరక్షణకు పూర్తి భరోసా కల్పిస్తోందన్నారు. అదేవిధంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి, లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం త్వరితగతిన అందిస్తోందని తెలిపారు. ఇప్పటికే భారీగా సీఎంఆర్ఎఫ్ ద్వారా కూటమి ప్రభుత్వం సాయం అందించిందన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్య చికిత్స చేయించుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం సహాయనిధి ఆసరాగా నిలుస్తోందన్నారు. ఈ సందర్భంగా సాయం పొందిన లబ్దిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి, శాసనసభ్యులు కృష్ణప్రసాదుకి కఅతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకు సిఎం సహాయనిధితో ఆర్థిక భరోసా : ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
