ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : తూనికలు, కొలతల్లో మోసాలు జరిగితే వెంటనే వినియోగదారులు లీగల్ మెట్రాలజీ అధికారులను సంప్రదించాలని లీగల్ మెట్రాలజీ సహాయ నియంత్రణ అధికారి పివి రంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. మే 20న జరిగే ప్రపంచ లీగల్ మెట్రాలజీ దినోత్సవాన్ని పురస్కరించుకొని లీగల్ మెట్రాలజీ శాఖ ఆధ్వర్యంలో వినియోగదారులకు అవగాహన కార్యక్రమాల్ని చేపట్టారు. ఇందులో భాగంగా నగరంలో శుక్రవారం రిలయన్స్ స్మార్ట్ బజార్ లో వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ తూనికలు, కొలతలలో జరిగే మోసాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈనెల 8న ఆర్అండ్బి రైతుబజార్లో ధర్మ కాటా ఏర్పాటు చేసి వినియోగదారులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. రిలయన్స్ స్మార్ట్ బజారులో ప్యాకేజీ పై పేర్కొనాల్సిన వివరములు గురించి సిబ్బందికి అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బి రైతు బజార్ ఎస్టేట్ అధికారి అప్పలనాయుడు, లీగల్ మెట్రాలజీ సిబ్బంది,వినియోగదారులు పాల్గొన్నారు.
