ప్రజాశక్తి-కడప అర్బన్ కేరళ పట్ల వివక్ష చూపుతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ చర్యలు ఖండించాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం మోడీ సర్కార్ కేరళలోని వామపక్ష ప్రభుత్వానికి అనేక ఆటంకాలు, అడ్డంకులు కల్పిం స్తున్నదని, చట్టపరంగా రావాల్సిన నిధులు విడుదల చేయలేదని అందుకు నిరస నగా కేంద్ర కమిటీ పిలుపు మేరకు కేరళ ప్రభుత్వానికి సంఘీభావంగా కడప అంబేద్కర్ సర్కిల్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మనోహర్, దస్త గిరిరెడ్డి, అన్వేష్, శ్రీనివాసులురెడ్డి, గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ గవర్నర్ను అడ్డం పెట్టుకుని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను తొక్కిపెడుతున్నారని తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తికి కేంద్రంలోని బిజెపి ప్రభు త్వం పూర్తి విఘాతం కల్పిస్తున్నదన్నారు. అత్యంత బలీయమైన సహకార రంగం ఉన్న కేరళ రాష్ట్రంలో ఈ రంగాన్ని నాశనం చేయడానికి కేంద్రం కంకణం కట్టు కుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని భారత పెట్రోలియం లాంటి భారీ పరిశ్రమలను అమ్మడానికి పూనుకుందని విమర్శించారు. దీనిపై కేరళలో సంవత్సరం పైగా పెద్ద ఎత్తున ఆందోళన సాగిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభు త్వం వెనక్కి తగ్గిందని చెప్పారు. త్రివేండ్రం విమానాశ్రయాన్ని అదానికి అప్పగిం చిందని తెలిపారు. ప్రభుత్వమే కొంటామన్నా ప్రభుత్వానికి అప్పగిం చడానికి నిరాకరించిందని పేర్కొన్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వయనాడ్ కొండ చర్యలు విరిగిపడి నాలుగు వందల మంది మరణించారని పేర్కొన్నారు. మరో వంద మంది నేటికీ లభ్యం కాలేదని చెప్పారు. ఇటువంటి తీవ్రమైన దురెటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలి కానీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని తెలిపారు. కేరళ పట్ల వివక్ష తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను దేశవ్యాప్తంగా ప్రజలం దరూ ఖండించాలని కోరుతున్నామన్నారు. కేరళ రాష్ట్రం దేశంలోనే అక్షరాస్యతలో అగ్ర స్థానంలో ఉందని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యధిక కాలం వామపక్షాలు అధికారంలో ఉన్నాయని చెప్పారు. ఇక్కడి ప్రజల చైతన్యం మెండు, రాష్ట్రంలోని పరిమిత వనరులతోనే సర్వతోముఖాభివద్ధి సాధించారని పేర్కొ న్నారు. కేరళలో కనీస వేతనం రోజుకు రూ.600 కానీ, అత్యధిక కార్మికులు రోజు కు రూ.1000కి పైగా వేతనం పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 30 రకాల వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేసి అన్ని రంగాల కార్మికులకు సంక్షేమ కార్యక్ర మాలను అమలు చేస్తున్నారని చెప్పారు. 13 రకాల నిత్యావసర సరుకులు ప్రజ లకు అతి తక్కువ ధరకు అందిస్తున్నారని పేర్కొన్నారు. కోవిడ్ కాలంతో సహా పిల్లలకు విద్యను అందించడంలో దేశంలోనే అగ్ర భాగంలో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సొంత గహం వామపక్ష పార్టీల కాలంలో ఏర్పాటు చేశా రని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను కూడా అతిధిగా భావించి వారికి రాష్ట్రంలోని ఇతర ప్రజల్లాగా అన్ని వసతులు సమకూర్చారని పేర్కొన్నారు. రైతులకు దేశంలోనే అత్యధిక గిట్టుబాటు ధరను అందిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత చర్యలు విరమించి చట్ట ప్రకారం రావా ల్సిన హక్కులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకు సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, నగర కార్యదర్శి రామ్మోహన్ పాల్గొని సంఘీభావం ప్రక టించారు. ధర్నాలో సిఐటియు నగర అధ్యక్షులు చంద్రారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నరసయ్య, రమణ, సురేష్, సిఐటియు నాయకులు గోవిందు, యువజన విద్యార్థి సంఘం నాయకులు విజరు, రవి పాల్గొన్నారు.
