ప్రజాశక్తి-పెద్ద దోర్నాల: పెద్దదోర్నాలలోని ఉన్నత పాఠశాల విద్యా ర్థులు షేక్ అర్ఫద్బాషా, షేక్ అబ్ధుల్ కఫీల్, షేక్ రఫీ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీ లలో స్వర్ణ పతకాన్ని సాధించగా బుధవారం ఉపాధ్యాయులు పాఠశాలలో అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రధానోపాధ్యా యుడు ఎస్వి నారాయణరెడ్డి అభినందించారు. ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి వాలీబాల్ ఛాంపియన్ షిప్ పోటీలు ఢిల్లీ నగరంలో జరిగా యన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం నాగ మూర్తి, వ్యాయామ ఉపాధ్యాయులు రామా నాయక్, ఉపాధ్యాయులు విజయ మాణిక్యం, అనుసూయ దేవి, కిరణ్ కుమార్, పోలయ్య, మీటే నాయక్, వెంకట శివ కుమారి, చంద్రమౌలి, శిరీష రాణి, ఆంజనేయులు, ఆవులయ్య, లక్ష్మీ నారాయణ, మారుతి, రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
