ప్రజాశక్తి-హలహర్వి (కర్నూలు) : కార్మిక వర్గ చట్టల రక్షణకై 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు మండల అధ్యక్షులు కృష్ణ అన్నారు. మంగళవారం రోజున సిఐటియు ఆధ్వర్యంలో హాలహర్వి మండలం లో ఉన్న హాలహార్వి ప్రైమరీ హెల్త్ సెంటర్ అర్ధగిరి లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ వన్నూరు వలి గంగాధర్ ల కు సమ్మె నోటిస్ అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాల అవలంభిస్తుందని, ఇలాంటి చట్టాలు అమలు చేయకుండా కార్మిక వర్గంతో వెట్టి చాకిరి చేయించుకుంటుందనారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న స్కీం వర్కర్లు ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా ఉన్నదని పారితోషకం పేరుతో ఆశ వర్కర్ల శ్రమదోపిడి చేస్తున్నదని అన్నారు. ఏళ్ల తరబడిగా గ్రామాలలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న ఆశ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలనీ పర్మినెంట్ చేయాలని కార్మిక చట్టాల అమలు చేయాలని పని భారం తగ్గించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కఅష్ణ, ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు విజయలక్ష్మి ఆశ వర్కర్లు శివమ్మ తదితరులు పాల్గొన్నారు.
