ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : ఏపి ఫార్మా రిజిస్ట్రేషన్ పథకాన్ని రైతు పాసు పుస్తకాల ఖాతాకు విశిష్ట సంఖ్యను రిజిస్ట్రేషన్ చేయాలని మంగళవారం సీపీఐ నాయకులు తహసిల్దార్ అరుణ కుమారి కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి. చిన్నప్ప యాదవ్ మాట్లాడుతూ … ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రైతు పొలము సర్వే నంబర్లకు ఫార్మా రిజిస్ట్రేషన్ పథకమును మొదలుపెట్టి నెల రోజులు అవుతున్న ఇది ఆచరణలో సాధ్యం కాలేదన్నారు. కేవలం సర్వే నంబర్ల పైన విశిష్ట నంబర్ సంఖ్యను రిజిస్ట్రేషన్ చేస్తే ఖాతా లో ఉన్న మిగతా సర్వే నెంబర్లు కనుమరుగే అయ్యే అవకాశం ఉందని తెలిపారు. గతంలో రీ సర్వే వల్ల తప్పిదాలు జరిగినట్లు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలు కూడా తప్పిదాలు జరిగే అవకాశం ఉంది. అందుకోసం ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులకు సూచించాల్సిన విషయాలు ఏమిటంటే ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు అనే నిబంధన లేకుండా అన్ని భూములకు పాసు పుస్తకంలో ఉన్న అన్ని సర్వే నంబర్లకు విశిష్ట నంబర్లను కేటాయించాలి. పీఎం కిసాన్ చెల్లింపులు, అన్నదాత సుఖీభవ పథకం, మరియు పంట నష్టపరిహారం, పంటల బీమా పథకాలు,పంట ఋణాలపై వడ్డీరాయితీ,సబ్సీడిపై యంత్ర పరికరాలు,రాయితీ పై సూక్ష్మపోషకాలు,సూక్ష్మసేద్యం పై రాయితీ,పంటఋణాలు,పథకాలు రైతులకు నష్టం కల్గకుండా ఉండే అవకాశం ఉంటుంది.విశిష్ట గుర్తింపు నెంబర్ పాస్ పుస్తకాల్లో ఒక ఒకే సర్వే నెంబరుకు మాత్రమే చేయడం జరిగిందని వ్యవసాయ అధికారులు చెప్పడం జరుగుతున్నది ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వము రైతులకు సమస్యలు లేకుండా న్యాయం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గంగాధర్ సహాయ కార్యదర్శి చాపల రామంజి,సుధాకర్, నారాయణమ్మ, కుళ్ళయమ్మ, అరుణమ్మా,ఇంద్ర,రమాదేవి, భవాని, లక్ష్మి నారాయణ , కిటయ్య,తదితరులు పాల్గొన్నారు.
ఏపి ఫార్మా రిజిస్ట్రేషన్ పథకాన్ని రైతు పాసు పుస్తకాల ఖాతాకు రిజిస్ట్రేషన్ చేయాలి : సిపిఐ
