ప్రజాశక్తి-కడప అర్బన్ : కడప నగర పరిధిలో ఉన్న పుట్లంపల్లి చెరువు కట్ట కింద ఉన్న తూములు యధాతధంగా కొనసాగించాలని సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని పుట్లంపల్లి చెరువు అభివఅద్ధి పనులను ప్రజా చైతన్య యాత్రలో భాగంగా పార్టీ ప్రతినిధి బఅందం సందర్శించింది. ఈ సందర్భంగా రామమోహన్ మాట్లాడుతూ పుట్లంపల్లి చెరువు అభివఅద్ధిని సిపిఎం స్వాగతిస్తోందని తెలిపారు. అభివఅద్ధి పేరుతో చెరువు నీరు తూముల ద్వారా పంట పొలాలకు అందే అవకాశం లేకుండా చేయడం భవిష్యత్ అవసరాలకు మంచిది కాదన్నారు. తూములు పూడ్చడం ద్వారా దాదాపు 100 ఎకరాలకు చెరువు నీరు విడుదల అయ్యే అవకాశం లేదన్నారు. వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మార్పు చేసినా చెరువు నీరు నిండినప్పుడు చెరువు బయటికి నీరు విడుదల కావాల్సి ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ భూములను గఅహ వినియోగం కోసం మార్చినా ఈ తూముల ప్రాధాన్యత కీలకమన్నారు. తక్షణమే అధికార యంత్రాంగం చెరువు కట్ట కింద తూములు యధాతధంగా కొనసాగించేలా నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరిరెడ్డి, నగర కమిటీ సభ్యులు చంద్రారెడ్డి, రామకఅష్ణారెడ్డి, గోవిందు, నరసింహ, జార్జి,భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
పుట్లంపల్లి చెరువు కట్ట కింద తూములు యధాతధంగా కొనసాగించాలి : సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్
