ప్రజాశక్తి-కడప అర్బన్ : స్మార్ట్ మీటర్లు రద్దు చేయకపోతే మరో విద్యుత్ పోరాటానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, సిపిఐ నగర కార్యదర్శి వెంకట శివ హెచ్చరించారు. వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం సిపిఎం జిల్లా కార్యాలయం లో విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ లో ఆనాటి బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమంలో అమరులైన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్, సిపిఐ నగర కార్యదర్శి వెంకట శివ మాట్లాడుతూ 2000 సంవత్సరం ఆగస్టు 28న ఆనాటి పాలకులు ప్రపంచ బ్యాంకు షరతులో భాగంగా విద్యుత్ ఛార్జీల పెంపుకు పూనుకున్నారని తెలిపారు. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వామపక్షాలు, కాంగ్రెస్ శ్రేణులు కలిసి పెద్ద ఎత్తున పెంచిన విద్యుత్ ఛార్జింగ్ తగ్గించాలని ఉద్యమం నిర్వహించారని తెలిపారు. ఆ ఉద్యమంలో భాగంగా చలో హైదరాబాద్ కు పిలుపు ఇచ్చిన సందర్భంలో బషీర్బాగ్ కాల్పుల ఘటనలో వామపక్ష పార్టీల నాయకులు రామకఅష్ణ, విష్ణువర్ధన్, బాలస్వామి పై చంద్రబాబు ప్రభుత్వం కర్కశంగా కాల్పులు చేసిందని విమర్శించారు. ఆ ఘటనలో ముగ్గురు అమరులయ్యారని పేర్కొన్నారు. అప్పటి నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచాలంటే పాలక ప్రభుత్వాలు భయపడేవిని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు, నివాస గఅహలకు విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాదేశాలకు లంగి రాష్ట్రంలోని నివాస గఅహాలకు విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టాలని గత వైసిపి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. అదే విధానాన్ని తెలుగు దేశం కూటమి ప్రభుత్వం అమలుకు సిద్ధపడడం సరికాదని అన్నారు.అదానీ, షిరిడి సాయి తదితర కంపెనీలకు కాంట్రాక్టులను కట్టబెట్టడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నదని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండగా ఈ మీటర్లను వ్యతిరేకించిందని తెలిపారు. హైకోర్టులో పిటీషన్లు వేశారని చెప్పారు. నేడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒప్పందాలను రద్దు చేయకపోగా స్మార్ట్ మీటర్ల ప్రక్రియను కొనసాగిసించడానికి నిర్ణయించు కోవడం ఏమిటని ప్రశ్నించారు. విజయవాడతో సహా పలు ప్రాంతాల్లో అదానీ సంస్థకు చెందిన మీటర్లను తెచ్చి విద్యుత్ కార్యాలయాల్లో భద్రపరుస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ మీటర్లు బిగిస్తున్నారని తెలిపారు. తదుపరి వ్యవసాయ పంపు సెట్లకు, నివాస గఅహాలకు మీటర్లు బిగించే ప్రక్రియకు సిద్ధమవుతున్నారని చెప్పారు. మొదటి దశలో వ్యవసాయం పంపు సెట్లకు మీటర్ల పేరుతో క్రమంగా ఉచిత విద్యుత్తుకు ఎసరుపెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నివాస గఅహాలకు మీటర్లతో ప్రీపెయిడ్ పద్ధతి, విద్యుత్ వాడే సమయాన్నిబట్టి అదనపు ఛార్జీలు, మీటర్ల ఖర్చును వినియోగదారులపై వేయటం తదితర రూపాల్లో భారం పడుతుందన్నారు. వేలాదికోట్ల రూపాయల ప్రజాధనం మీటర్ల పేరుతో దుర్వినియోగమవుతుందని పేర్కొన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాట తప్పి కేంద్ర ప్రభుత్వాదేశాలకు లంగిపోయిందని విమర్శించారు. గతంలో వ్యతిరేకించిన మీటర్లనే కొనసాగించడం వాగ్దాన భంగమే అవుతుందని తెలిపారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ పంపు సెట్లకు, నివాస గఅహాలకు స్మార్ట్ మీటర్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆదాని, షిర్డీ సాయి తదితర కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని పేర్కొన్నారు. బిగించిన మీటర్లను తొలగించాలని చెప్పారు. అప్పుడే నిజమైన విద్యుత్ ఉద్యమంలో అమరులైన వారికి మనం నివాళులు అర్పించడం అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఏ.రామ్మోహన్ బి.మనోహర్, ఐ.ఎన్. సుబ్బమ్మ, శ్రీనివాసులు రెడ్డి, దస్తగిరి రెడ్డి, సిపిఐ జిల్లా నాయకులు సావంత్ సుధాకర్, భాగ్యమ్మ, సిపిఎం నగర కమిటీ సభ్యులు చంద్రారెడ్డి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి. శివకుమార్, నగర నాయకులు ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.
స్మార్ట్ మీటర్లు రద్దు చేయకపోతే మరో విద్యుత్ పోరాటానికి శ్రీకారం : సిపిఎం, సిపిఐ
