భీమవరం (పశ్చిమ గోదావరి) : పాలకోడేరు శివారు ఏఎస్ఆర్ నగర్ లో కూల్చివేసిన పేదల ఇళ్లను సిపిఎం నేతలు మంగళవారం ఉదయం పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు బి.బలరాం, మంతెన సీతారాం, జిల్లా కార్యదర్శి జెఎన్వి.గోపాలన్ పాల్గొన్నారు.
