పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో కొవ్వొత్తుల ప్రదర్శనలో సిపిఎం శ్రేణులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఉగ్ర దాడులకు నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శనలు శనివారమూ కొనసాగాయి. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మహాత్మాగాంధి విగ్రహం ఎదుట కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు, ఎస్.ఆంజనేయులు నాయక్, నాయకులు డి.శివకుమారి మాట్లాడుతూ దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ధిపొందడానికి ఈ ఘటలను వాడుకోకుండా శాంతిభద్రతలను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కె.రామారావు, కె.కోటేశ్వరరావు, సయ్యద్ రబ్బాని, ఎం.ఆంజనేయులు పాల్గొన్నారు.ప్రజాశక్తి – దుగ్గిరాల స్థానిక బోసు బొమ్మ సెంటర్లో సిపిఎం శ్రేణులు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టాయి. ఉగ్రదాడుల్లో మృతులకు నివాళులర్పించారు. సిపిఎం మండల కార్యదర్శి జె.బాలరాజు మాట్లాడుతూ భారతీయులందరూ ఒక్కటేనం టూ దేశంలో ప్రజల మధ్య ఐక్యత ప్రపంచానికే ఆదర్శమన్నారు. కార్యక్రమంలో జి.శ్రీనివాస రావు, వెంకటనారాయణ, బి.నాగేశ్వరావు, బి.ప్రసాద్, శివనాయక్, ఖాసీం నాయక్, ఏడుకొండలు, జె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.ప్రజాశక్తి – పెదనందిపాడుస్థానిక తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. విజ్ఞాన కేంద్రం కన్వీనర్ డి.రమేష్బాబు, పిఎఎస్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ గుర్రం వీరరాఘవయ్య మాట్లాడుతూ దేశంలో అన్ని మతాలవారు కలిసిమెలిసి జీవిస్తున్నారని, ఇదే ఐక్యతను కొనసాగిద్దామని అన్నారు. జి.మోహన్రావు, జి.రమేష్, షేక్ షమి, ఎం.లక్ష్మి, జె.రామారావు, విద్యార్థులు పాల్గొన్నారు.ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్మండలంలోని రెంటపాళ్లలో సిపిఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిచారు. మృతులకు నివాళులర్పించిన అనంతరం సిపిఎం మండల కార్యదర్శి పి.మహేష్ మాట్లాడుతూ ేశ సమగ్రత, సమైఖ్యత కోసం భారతీయులందరూ కలిసి ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిపై పోరాడాలని పిలుపునిచ్చారు. దాడుల నివారణలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందే దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాద దాడులను కూడా రాజకీయ లబ్ధికోసం వాడుకోవాలని బిజెపి చూడడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎం.నరసింహారావు, జె.భగత్, బి.రామారావు, డి.మేరమ్మ, గ్రామస్తులు ఎం.శివరావు, అనుష, సుజాత, అమూల్య, లక్ష్మి, తాతారావు, వెంకటపతి, సౌజన్య పాల్గొన్నారు.
దుగ్గిరాలలో కొవ్వొత్తుల ప్రదర్శన
